కేంద్రహోంమంత్రి షిండే ప్రకటించినట్లుగా ఈ నెల 28లోగా తెలంగాణపై ప్రకటన రాకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీ జేఏసీ హెచ్చరించింది. కేంద్రమంత్రి ఆజాద్ అఖిలపక్షాన్ని అవమానపరచిండని టీ జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం మండి పడ్డారు. తెలంగాణ ఉద్యమం భవిష్యత్తు కార్యాచరణపై టీ జేఏసీ అత్యవసరంగా సమావేశమైంది.
ఈ నెల 27న ఇందిరాపార్కు వద్ద సమరదీక్ష చేపట్టాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణ అంశంపై చర్చించేదుకు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అంశంపై నెలరోజుల్లోగా నిర్ణయం వెల్లడిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే మాట తప్పి అఖిలపక్ష సమావేశానికి హాజరైన అందరిని అవమానించారని తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.