హైదరాబాద్ : 11 అంశాలపై కేంద్రమంత్రుల బృందానికి నివేదిక పంపినట్లు టీ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. నివేదికలో హైదరాబాద్ను మూడేళ్లకు మించి ఉమ్మడి రాజధానిగా ఉండవద్దని కోరినట్లు ఆయన వెల్లడించారు. సింగరేణి పై ఇప్పుడున్న అధికారాన్ని కొనసాగించాలని, ట్రైబ్యునల్స్ తీర్పుల ప్రకారమే నీటి పంపిణీ జరగాలని నివేదిక కోరినట్లు ఆయన పేర్కొన్నారు. జీవో 53 ప్రకారం విద్యుత్ కేటాయింపులు జరపాలని, అవసరం మేరకు అదనపు గ్యాస్ కేటాయించాలని ఆయన కోరారు.
11 అంశాలతో జీవోఎంకు నివేదిక:కోదండరాం
Posted on October 19, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.