హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ బిల్లును సీఎం కిరణ్కుమార్రెడ్డి వ్యతిరేకిస్తే దాన్ని ధీటుగా ఎదుర్కొంటామని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్రావు అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో ఉన్న అభ్యంతరాలపై సభలో ప్రస్తావిస్తామని తెలిపారు. తుపాను నష్టపరిహారం, రైతుసమస్యలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రైతులను ఆదుకోవడంలో కూడా సీఎం కిరణ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సీఎం వ్యతిరేకిస్తే ధీటుగా ఎదుర్కొంటాం: హరీష్
Posted on December 11, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.