మెదక్: ముఖ్యమంత్రి కిరణ్ ప్రభుత్వ కార్యక్రమాల్లో సమైక్యవాదం వినిపించడం సరైంది కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. ప్రజల సొమ్ముతో సమైక్యవాదం వినిపించే హక్కు ఎవరిచ్చారని హరీష్ ప్రశ్నించారు. సీఎం తన పదవికి రాజీనామా చేసి సమైక్య నినాదంతో జనంలోకి వెళ్లాలన్నారు. కాని ప్రజల సొమ్ముతో సమైక్యవాదం వినిపించే హక్కు కిరణ్కు లేదన్నారు. కిరణ్కుమార్రెడ్డిని గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం సొంత నివేదికనే రాష్ట్ర నివేదికగా కేంద్రానికి పంపాడని ఆరోపించారు. సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజలను రెచ్చగొట్టి సీఎం సమైక్య ఉద్యమాన్ని కిరణ్ నడుపుతున్నాడని విమర్శించారు. దమ్ముంటే సీఎం కిరణ్ పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమం నడపాలని డిమాండ్ చేశారు.
సీఎం రాజీనామా చేసి సమైక్యరాగం వినిపించు: హరీష్
Posted on November 15, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.