హైదరాబాద్: తెలంగాణకు మద్దతు తెలుపుతూ ప్రకటన చేసిన ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్పవార్కు టీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకుడు హరీష్రావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము మద్దతునిస్తామని పవార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజల తరపునా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని హరీష్రావు పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు మద్దతునిస్తూ ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్పవార్ చేసిన సూచన మేరకైనా ప్రధాని మన్మోహన్సింగ్ నిర్ణయం తీసుకోవాలని హారీష్రావు అన్నారు. తెలంగాణ అంశంపై ప్రధాని వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
శరద్పవార్కు కృతజ్ఞతలు, ప్రధాని నిర్ణయం తీసుకోవాలి-హరీష్రావు
Posted on January 31, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.