హైదరాబాద్ : వైఎస్ ప్రేతాత్మ కేవీపీ రూపంలో తెలంగాణకు అడ్డుపడుతున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నరు. తెలంగాణ చరిత్రను కించపరిచేలా మాట్లాడిన ఉండవల్లి అరుణ్కుమార్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవీపీ రామచందర్రావు డైరెక్షన్లో వీధి నాటకాలు ఆడుతూ రంగ స్థల నటుడిలా ఉండవల్లి అవతారమెత్తాడని ఆయన విమర్శించారు. రాజమండ్రి సభలో ఉండవల్లి చేసిన ప్రసంగాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. సీమాంధ్ర నేతల పాత ప్రసంగాలను ఆయన ప్రదర్శించారు. తమది వేర్పాటు వాదమైతే మద్రాసు నుంచి విడిపోయిన మీది ఏ వాదం అని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్నే అవమానించిన చరిత్ర ఉండవల్లిది అని ధ్వజమెత్తారు. ఉండవల్లి దుర్మార్గులు ఉంటారనే అంబేద్కర్ ఆర్టికల్ 3ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పేరుకే జై ఆంధ్రప్రదేశ్ సభ కానీ, అక్కడ ఒక్క తెలంగాణ నాయకుడు లేరని తెలిపారు. సీమాంధ్ర నేతల ఉన్మాద వైఖరి వల్లే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీమాంధ్ర నాయకులది వంకరబుద్ధి అని, చిల్లర నాటకాలు మానుకోవాలని హెచ్చరించారు. విశాలాంధ్ర వాదన సామ్రాజ్యవాద కాంక్షతో నిండి ఉందని నెహ్రూ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు
వైఎస్ ప్రేతాత్మ కేవీపీ రూపంలో తెలంగాణకు అడ్డుపడుతున్నది-కేటీఆర్
Posted on January 26, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.