హైదరాబాద్ : వడగండ్ల వాన బాధితులకు నష్టపరిహారం కోసం సీఎం కిరణ్కుమార్రెడ్డి కి టీఆర్ఎస్ఎల్పీ ఉప నేత టి. హరీష్రావు లేఖ రాశారు. ఇటివల కురిసిన వడగండ్ల వాన వల్ల తెలంగాణ జిల్లాల్లో పెద్ద ఎత్తున్న రైతులు నష్టపోయారని వారికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. వడగండ్ల వానకు నష్టపోయిన వారికి రూ.10 వేలు, చనిపోయినవారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్గ్రేసియా చెల్లించాలని హరీష్రావు డిమాండ్ చేశారు. నీలం తుపాను వల్ల నష్టపోయిన ఆంధ్రారైతులకు నష్టపరిహారం చెల్లించి వరంగల్,ఖమ్మం జిల్లా రైతులకు ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం వెంటనే స్పందించి వరంగల్, ఖమ్మం జిల్లా రైతులకు పరిహారం చెల్లించాలని హరీష్ డిమాండ్ చేశారు.
వడగండ్ల వాన బాధితులకు నష్టపరిహారం ఇవ్వండి-సీఎంకు హరీష్రావు లేఖ
Posted on April 3, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.