హైదరాబాద్: చట్టప్రకారం తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన వాటి గురించే డిమాండ్ చేశామని టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. జీవోఎంకు టీఆర్ఎస్ తరపున సమగ్రమైన నివేదిక ఇచ్చామని స్పష్టం చేశారు. గత అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రాంతం దోపిడికి గురవుతుందని తెలిపామన్నారు. తెలంగాణకు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు దోపిడి ద్వారా తెలంగాణకు రూ.4.1 లక్షల కోట్లు నష్టం సంభవించిదని, అందుకే తెలంగాణకు రూ.4.5 లక్షల కోట్లను ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అన్నారు.
రావాల్సినవే డిమాండ్ చేశాము: ఈటెల
Posted on November 3, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.