ఎం రఘునందన్రావుపై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ ద్రోహానికి పాల్పడినందుకు మెదక్ జిల్లాకు చెందిన ఎం రఘునందన్రావును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా, పార్టీ విద్రోహ కార్యకలాపాలలో పాల్గొన్నందుననే ఆయన్ను సస్పెండ్ చేసినట్లు టీఆర్స్ అధ్యక్షుడు తెలిపారు. కాగా, వసూళ్లకు పాల్పడుతున్నడని రఘునందన్రావుపై గతంలోనే మెదక్ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును పాదయాత్ర సందర్భంగా కలిసినట్లుగా కూడా తెలిసింది. రఘునందన్రావు గతంలో మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
రఘునందన్రావుపై టీఆర్ఎస్ వేటు
Posted on May 15, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.