నైతికంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడినట్టేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉందనుకుంటే అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధం కావాలని ఆయన సవాలు విసిరారు. బలపరీక్ష పెట్టాలని కోరుతూ త్వరలో గవర్నర్ను కలిసి కోరుతామని తెలిపారు. నైతికంగా దెబ్బతిన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు.
ప్రభుత్వం మైనారిటీలో పడినట్టే: కేటీఆర్
Posted on February 7, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.