సెక్రటేరియట్ కేంద్రంగా సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెడుతున్నారని కోదండరాం ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా తెలంగాణకు చెందిన ఇరవై వేల మంది ఉద్యోగులకు నష్టం జరిగిందని ఆయన విమర్శించారు.
తెలంగాణకు అడ్డుపడుతూ, ఇంకొంత కాలం తెలంగాణ రాకుండా అడ్డుకుని తెలంగాణలోని వనరులను ఇంకొంత కాలం దోచుకోవాలని సీమాంధ్ర నాయకులు చూస్తున్నారని కోదండరాం ఆరోపించారు. ఇది సీమాంధ్ర పెత్తనానికి..తెలంగాణ స్వేచ్ఛకు జరుగుతోన్న పోరాటంగా తెలంగాణ ఉద్యమాన్ని అభివర్ణించారు. ఆది, సోమ వారాల్లో జేఏసీలో చర్చించి పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని, దానికి ప్రజలంతా సహకరించాలని కోదండరాం కోరారు.
తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెడుతున్నారు-కోదండరాం
Posted on February 2, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.