కరీంనగర్: సీంఎ, పీసీసీ పాల్గొన్న సభలో తెలంగాణ డిమాండ్ భగ్గుమంది. ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఎన్ని చేసినా వేస్టు అని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన హుస్నాబాద్లో సీఎం, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు పాల్గొన్న బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ డిమాండ్ ముందు ప్రభుత్వ పథకాలు వెలవెలబోతున్నాయని ఆయన విమర్శించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వాలని పొన్నం డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్కు తెలంగాణలో పుట్టగతులుండవని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బయ్యారంలోనే ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని ఎంపీ డిమాండ్ చేశారు.
తెలంగాణ ఇవ్వకుండా ఎన్ని చేసినా వేస్ట్: పొన్నం
Posted on April 28, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.