ఆంధ్రా సీఎం చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్తో టీఆర్ఎస్కు ఫ్రూట్ కేక్.. టీడీపీ తమ్ముళ్లకు షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో టీఆర్ఎస్కు పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన చంద్రబాబు.. తాజాగా తెలంగాణపై విషం కక్కి బ్రహ్మాస్త్రాన్ని అందించారని టీటీడీపీ నేతలు మదనపడుతున్నారు. 2019లో టీఆర్ఎస్ దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకుంటుందని బాధపడుతున్నారు. నిన్నటివరకు ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో.. టీఆర్ఎస్ క్యాండిడేట్పై వ్యతిరేకతతోనో తమకు అనుకూలంగా ఓట్లు పడతాయని ఏదో ఓ మూలకు ఆశ పెట్టుకున్న టీడీపీ నేతలకు.. అమరావతిలో కొత్త అసెంబ్లీ ఓపెనింగ్ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దిమ్మదిరిగింది. టీడీపీ నుంచి టికెట్ వచ్చినా వేస్టేననే భావనకు వచ్చినట్టు సమాచారం.
టీఆర్ఎస్కు కేక్.. టీడీపీ తమ్ముళ్లకు షాక్
Posted on March 4, 2017
This entry was posted in TELANGANA NEWS, Top Stories.