మెదక్: సీమాంధ్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ న్యాయవాదులు తమ గమ్యాన్ని ముద్దాడారు. తెలంగాణ ద్రోహి సంగారెడ్డి ఎమ్మెల్యే అని ఆరోపిస్తూ ఆయన ఇంటిని తెలంగాణ లాయర్లు ముట్టడించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద జైతెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగిన తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ నేతలు జగ్గారెడ్డి ఒక తెలంగాణ ద్రోహి అని నినాదాలు చేశారు. జగ్గారెడ్డికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర నినాదంతో మళ్లీ గెలవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. జగ్గారెడ్డికి ఇకపై రాజకీయ సమాధి నిర్మిస్తామని వారు హెచ్చరించారు.
జగ్గారెడ్డి ఇంటిని ముట్టడించిన టీ లాయర్లు
Posted on December 25, 2012
This entry was posted in TELANGANA NEWS, Top Stories.