న్యూఢిల్లీ : గడువుకు ముందే తెలంగాణ బిల్లు వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే తెలిపారు.మీడియాతో ఆయన మాటలు…‘త్వరలోనే తెలంగాణ బిల్లు వస్తుంది. వీలైనంత త్వరగా తెలంగాణ ప్రక్రియ పూర్తి చేస్తాం. యూపీఏ కాల పరిమితి ముగిసే లోపు తెలంగాణ బిల్లు పాస్ చేస్తాం. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందో లేదో చెప్పలేం. హైదరాబాద్పై తుది నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్పై తమ ముందుకు చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని జీవోఎం పరిశీలిస్తుంది. శ్రీకృష్ణ కమిటీ కూడా చాలా ప్రతిపాదనలు చేసింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అన్న అంశంపై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. ఇంతకు ముందు పలుసార్లు అఖిలపక్షం నిర్వహించాం, రేపు కూడా నిర్వహిస్తాం. రేపటి అఖిలపక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తాం. 371-డీపై మంత్రుల బృందం సిఫారసుల ఆధారంగానే చర్యలు ఉంటాయి. నీటి పంపకం, విద్యుత్, రెవెన్యూ సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. రాష్ట్ర విభజనకు ముందు అనేక సమస్యలకు పరిష్కారాలు అవసరం.
గడువుకు ముందే తెలంగాణ బిల్లు : షిండే
Posted on November 11, 2013
This entry was posted in NATIONAL NEWS, Top Stories.