నాలుగున్నర ప్రజల ఆశాకిరణం కేసీఆర్కు ఏమైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లొలం అవుతుందని టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఉప నేత హరీష్రావులు హెచ్చరించారు. కేసీఆర్ రక్షణ గురించి ప్రభుత్వానికి ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేశామని, అయినా ప్రభుత్వం తరపున కనీస స్పందన లేదని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఉద్యమ నేతను హత్య చేయాలనుకోవడం పిరికి పందల చర్య అని, తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర దోపిడీకి కేసీఆర్ అడ్డుపడతారనే భయంతోనే ఆయన హత్యకు కుట్ర జరుగుతోందని పార్టీ ఆరోపించింది. ఎంతో కాలంగా ఎన్నో బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్నాయని, అప్పట్నుంచి ఉద్యమ నేతను తాము కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని ఆ పార్టీ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ భద్రతకు ముప్పు ఉందన్న విషయం చాలారోజులుగా బయటికి చెప్పకపోయినా, ఆయన ప్రాణాలకేమైనా జరిగితే తెలంగాణ అన్యాయమైపోతుందనే ఉద్దేశంతోనే బయటికి చెబుతున్నామన్నారు. ప్రభుత్వం, పోలీసులు వెంటనే స్పందించి కేసీఆర్పై జరుగుతున్న కుట్రను కనిపెట్టాలని కోరారు.
కేసీఆర్కు ఏమైనా జరిగితే రాష్ట్ర అల్లకల్లోలమవుతుంది : హరీష్
Posted on August 6, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.