తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే అసలైన సమన్యాయం జరుగుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 60 ఏళ్ల ఆంధ్రోళ్ళ పెత్తందారీతనం నుంచి తెలంగాణకు విముక్తి జరగడమే అసలు సిసలు న్యాయమని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిని కనుక ఉమ్మడి రాజధాని పరిధిగా నిర్ణయిస్తే తాము మరో పోరాటానికి సిద్ధం కాక తప్పదన్నారు. టీ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు వీ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు స్తంభాపూక్కి వైర్లు సవరిస్తుంటే సీమాంవూధులు ఏసీల్లో కూర్చుని పెత్తనాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్ మాట్లాడుతూ ఇక్కడ అక్రమంగా పొందిన ఆస్తులను కాపాడుకోవడానికే జీహెచ్ఎంసీ పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయాలని సీమాంధ్ర నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఉమ్మడి రాజధాని పరిధిపై మరో పోరాటం:కోదండరాం
Posted on November 17, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.