హైదరాబాద్: వైఎస్సార్సీపీలో చేరిన కొండా సురేఖకు మతి భ్రమించిందని, ఆమె పిచ్చిపిచ్చిగా మాట్టాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే తారక రామారావు అన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకుని, పార్లమెంట్లో ప్లకార్డు పట్టుకుని తెలంగాణను అడ్డుకున్న తెలంగాణ ద్రోహి జగన్తో కలిసి, జగన్తో పనిచేస్తూ తెలంగాణకు అనుకూలమంటే సురేఖను తెలంగాణ ప్రజలు నమ్మరని తెలిపారు. మాలో తప్పుంటే ఎత్తి చూపాలి కానీ, ఎవరు ఇటుకతో కొట్టినా మేము రాయితో కొడతామని కొండా సురేఖ అనుచరుల దాడిని ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. రాయలసీమ గూండాగిరిని చూపిస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నేతలు ఒళ్లుదగ్గర పెట్టుకొని మాట్లాడాలని, వ్యవహరించాలని సూచించారు.
ఇటుకతో కొడితే రాయితో బదులిస్తాం- కేటీఆర్
Posted on December 19, 2012
This entry was posted in TELANGANA NEWS, Top Stories.