హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీలో మరోసారి జైతెలంగాణ నినాదాలు మారుమోగాయి. బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తెలంగాణ నినాదాల మధ్య ఆదరాబాదరాగా సాగింది. సంస్కృతం మంత్రాలు చదివినట్లు గవర్నర్ తన ప్రసంగాన్ని జెట్ స్పీడ్లో కొనసాగించారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించక పోవడంతో ఆగ్రహం చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రసంగ ప్రతులను చించి విసిరేశారు. జైతెలంగాణ నినాదాలతో సభ దద్ధరిల్లింది. దీంతో గవర్నర్ ప్రసంగం అర్థంగాక సభ్యులు బిక్క మొగం వేసి చూస్తూ ఉండి పోయారు. అంతకు ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్పార్క్ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి అక్కణ్నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు.
ఆదరాబాదరగా గవర్నర్ ప్రసంగం
Posted on March 13, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.