న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీకి, తెలంగాణ బిల్లుకు ఎలాంటి సంబంధంలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్సింగ్ అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. కాకపోతే, ఆంటోనీ కమిటీ చేసిన సిఫార్సులను తెలంగాణ బిల్లులో చేర్చుతామని వివరించారు. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ బిల్లు కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానం విషయంలో తాము వెనక్కిపోయే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ‘మాది జాతీయ పార్టీ. కాంగ్రెస్పార్టీకి సుధీర్ఘ చరిత్ర ఉంది. ఇచ్చిన మాటను మాపార్టీ వెనక్కి తీసుకోలేదు. ప్రాంతీయ పార్టీలు వెనక్కి తగ్గొచ్చు. కానీ జాతీయపార్టీగా మేం వెనక్కి తగ్గలేం’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయానికి కాంగ్రెస్పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
‘ఆంటోనీ కమిటీకి తెలంగాణబిల్లుకు సంబంధంలేదు’
Posted on September 26, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.